కీర్తి
(మరల పొందిన అమ్మ ప్రేమ Part-1.3)
హైదరాబాద్ లో కీర్తి ని ఆదిత్య తన బిజినెస్ పార్టనర్ ఇంకా ప్రాణ స్నేహితుడైన రాజేష్ దగ్గరికి పంపాడు. రాజేష్ వాళ్ళది చిన్న కుటుంబం చింత లేని కుటుంబం. రాజేష్ భార్య పేరు పల్లవి వీళ్ళకి ఇద్దరు పిల్లలు ఒక పాప ఇంకా బాబు. అమ్మాయి పేరు స్పందన వయసు 20 సంవత్సరాలు, చాలా ప్రాక్టికల్ ప్రతి ఒక డెసిషన్ చాలా అలోచించి తీసుకుంటది తనకి మనుషుల కంటే జంతువులంటేనే ఎక్కువ ఇష్టం , బాబు పేరు సందీప్ వయసు 18 సంవత్సరాలు తనకి ఫుడ్ అన్న ఎద్దురింట్లో ఉండే అంకిత అన్న చాలా ఇష్టం తన లైఫ్ ఏదైనా పెద్ద అడ్వెంచర్ చెయ్యాలనేది సందీప్ కోరిక. ఇక్క పోతే పల్లవి సాధారణ తెలుగు మహిళా లా సీరియల్ అంటే పిచ్చి, అందులో క్యారెక్టర్ కి వచ్చే కష్టాలు తన కష్టాల భాధా పడుతుంది. తనకి ముందు సీరియల్ తరువాత పిల్లలు అతరువాతే మొగుడు. ఇక మిగిలింది రాజేష్ ఆదిత్య కి ఉన్న ఏకైక ప్రాణ స్నేహితుడు అతడు. రాజేష్ కి ఆదిత్య జీవితం లో జరిగిన ప్రతి ఒక విషయం తనకి తెలుసు ఆదిత్య ప్రియల లవ్ స్టోరీ నుంచి కీర్తి కి ఉన్న సూపర్ మ్యాజికల్ పవర్స్ వరకు అన్ని తెలుసు. ఆదిత్య ప్రతి ఒక విషయం రాజేష్ కి చెప్పేవాడు రాజేష్ ఎప్పుడు ఆ నమ్మకాన్ని వొమ్ము చేసెవాడు కాదు.
రాజేష్ కీర్తిని తన తో పాటు తన ఇంటికి తీసుకు వెళ్ళాడు. ఆ ఇంట్లో రాజేష్ కి తప్ప కీర్తి కి సూపర్ మ్యాజికల్ పవర్స్ ఉన్న విషయం ఎవ్వరికి తెలియదు. అందుకని కీర్తిని కాస్త జాగర్తగా ఉండమని సలహా ఇచ్చాడు . రాజేష్ కీర్తికి ఇంట్లో వాళ్లందరిని పరిచయం చేసాడు. కీర్తిని రాజేష్ తన రూమ్ కి తీసుకువెళ్లాడు అ రూమ్ లో కీర్తి గోడల మీద వాళ్ళ అమ్మ నాన్న లా ఫోటోలు ఉండడం చూసింది. అలా ఆ ఫోటో వైపు అడుగులు వేస్తూ ఆ ఫొటోలో అందంగా నవ్వుతున్న తన తల్లిని చూస్తూ కళ్లలో నీళ్లు తిరిగాయి. అప్పుడు రాజేష్ "ఈ ఇంట్లో ఒక్కప్పుడు మీ అమ్మ నాన్నలు ఉండే వారు ఈ రూమ్ వాళ్లదే, మీ నాన్న ఊరు వదలి వెళ్ళినప్పట్నుంచి మేము ఇక్కడే ఉంటున్నాం. కాని ఈ రోమ్ లో ఉండే జ్ఞపకాలను అలానే ఉంచాం నాకు తెలుసు ఏదో ఒక రోజు మీ నాన్నమళ్ళి ఇక్కడికి వస్తాడని, ఇవ్వాళా నువ్వు వచ్చావ్ వాడు కూడా వస్తాడు అన్నా నమ్మకం నాకు ఉంది , సరే జర్నీ చేసి అలసి పోయి ఉంటావ్ ఫ్రెష్ అయ్యి రా భోజనం చేదువు."
కీర్తి ఆ రూమ్ లో ఉండే వస్తువులన్నీ పరిశీలిస్తుంది. తనకి ఆ రూమ్ లో ని కప్బోర్డు లో వాళ్ళ అమ్మ తన కోసం కుట్టిన చిన్నప్పటి గౌను దొరికింది. ఆ గౌనును చేతిలోకి తీసుకొని చాలా భాధ పడింది ఆ గౌను పక్కనే ఆదిత్య బట్టలు ఇంకా ప్రియ బట్టలు ఉన్నాయి. ప్రియ వాళ్ళ అమ్మ చీరను తీసుకొని తన గుండెలకు గట్టిగ ఆదుకుంది.
అందరు డైనింగ్ టేబుల్ దగ్గర కీర్తి కోసం వెయిట్ చేస్తున్నారు. కీర్తి వాళ్ళ అమ్మ డ్రెస్ లో డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చింది అది చుసిన రాజేష్ కీర్తి ని " నువ్వు మీ అమ్మ కి మళ్ళి ప్రాణం పోసావ్" అని అన్నాడు . పల్లవి కీర్తి ని అర్ధం చేసుకుంది " నువ్వు మీ అమ్మ చాలా మిస్ అవ్వుతున్నావ్ కదా ". అని అడిగింది, కీర్తి తల ఉపుతు అవును అన్నట్టు సమధానం ఇచ్చింది. పల్లవి "ఈ ఏజ్ నువ్వు మీ అమ్మ ను ఎంత మిస్ అవ్వుతున్నావో ఇక్కడ నాకు మాత్రమే తెలుసు ఎందుకంటే మా అమ్మకూడా నేను పుట్టిన మరుక్షణం చనిపోయింది. నీకు ఎప్పుడు మీ అమ్మ ను మిస్ అవ్వుతున్నట్టు అనిపించిన నా దగ్గరికి రా నేను మీ అమ్మ కాలేను కాని అమ్మ ప్రేమను మాత్రం పంచగలను" ఆ మాటలను విన్న కీర్తి వెంటనే లేచి పల్లవిని గట్టిగ కౌగిలించుకొని ఏడిచింది. పల్లవి, రాజేష్ , స్పందన ఏడుస్తున్న కీర్తిని ఓదార్చారు . పల్లవి కీర్తికి ఇష్టమని పాయసం చేసింది తనకి తినిపిద్దామని చూస్తే సందీప్ ఒక్కడే ఆ మొత్తం పాయసాన్ని తాగేస్తున్నాడు. అందరు కన్నురెప్పలు అప్పకుండా సందీప్ నే చూస్తున్నారు. సందీప్ వాళ్ళు అలా చూస్తుంటే తట్టుకోలేక పోయాడు సందీప్ " smell చాలా tasty గా ఉంది టేస్ట్ ఎట్లా ఉంటదని కొంచెం తాగ, తాగక బౌల్ కాళి అయింది" అది విని కీర్తి నవ్వింది తాను నవ్వడం చూసి అందరు నవ్వారు. ఆ తరువాత అందరు కలిసి భోజనం చేసారు.
No comments:
Post a Comment